October 17, 2025
News Telangana
Image default
Andhrapradesh

తిరుమలలో కొనసా గుతున్న భక్తుల రద్దీ

News Telangana :- శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది.గత రెండు మూడు రోజుల కంటే ఈరోజు శ్రీవారి దర్శ నం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు.స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుం దని టిటిడి అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శ నానికి 6 గంటలు, రూ .300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయంపడుతుంది.భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుంటున్నారు.కాగా, శుక్రవారం శ్రీవారిని 71,037 మంది భక్తులు దర్శించుకుని మొక్కులుచెల్లించు కున్నారు.తిరుమలలో నిన్న 25,635 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

0Shares

Related posts

ఎమ్మెల్యే టికెట్ రేసులో శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజు యాదవ్?

News Telangana

CM Jagan: రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

News Telangana

పార్లమెంటుపై దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి అరెస్ట్?

News Telangana

Leave a Comment