July 21, 2025
News Telangana
Image default
Telangana

ఎన్ హెచ్ పై ఘోర రోడ్డు ప్రమాదం ఆటో బస్సు డి ముగ్గురు మృతి 9 మందికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా బ్యూరో న్యూస్ తెలంగాణ మోతె /ఖమ్మం- సూర్యాపేట 365 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు స్పాట్ డెడ్ అయ్యారు. మండల కేంద్రంలో బుధవారం ఉదయం తిరుపతమ్మ తల్లి దేవాలయం దగ్గరలోని అండర్ పాస్ క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర డిపో నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు మోతే మండల కేంద్రంలో క్రాస్ చేస్తుండగా మునగాల మండలం రామసముద్ర గ్రామానికి చెందిన కూలీల ఆటో మోతే నుండి హుస్సేన్ బాద్ గ్రామానికి వెళుతున్న ఆటోను అటుగా వస్తున్న బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఆటోలోని ఇతర కూలీలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక సూర్యాపేట ఏరియా హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై యోగవేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

0Shares

Related posts

ఘోర రోడ్డు ప్రమాదం బస్సు బోల్తా. 30 మందికి తీవ్ర గాయాలు

News Telangana

కడిగిన ముత్యంల జైలు నుండి బయటకు వచ్చిన కవితక్క

News Telangana

చింతమడక పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగించుకున్న కెసిఆర్ దంపతులు

News Telangana

Leave a Comment