October 16, 2025
News Telangana
Image default
Telangana

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

  • 30 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

సూర్యాపేట జిల్లా, నవంబర్ 02 / న్యూస్ తెలంగాణ :- రోడ్డు ప్రమాదం లో 30 మందికి గాయాలైన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ జాతీయ రహదారిపై కట్టకొమ్ముగూడెం రోడ్డు వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విజయవాడ వైపు వెళ్తుంది. ఈ క్రమంలోనే కోదాడ సమీపంలోకి రాగానే డ్రైవర్ విశ్రాంతి కోసం బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టీఎస్ ఆర్టీసీ బస్సు ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప కోదాడ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

0Shares

Related posts

ఎక్సైజ్,పర్యటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు పదవి బాధ్యతలు స్వీకరణ

News Telangana

అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

News Telangana

మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ

News Telangana

Leave a Comment