October 16, 2025
News Telangana
Image default
Telangana

ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్

హైదరాబాద్ / News Telangana : తెలంగాణ రాష్ట్రంలో.. కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తి 4100 క్యూసెక్కుల నీటిని, హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తి 2300 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నీటిని విడుదల చేయడంతో బాపుఘాట్, అత్తాపూర్, పురానాఫూల్, చాదర్ఘాట్, మూసారంబాగ్ వద్ద వరద తీవ్రత పెరిగింది. దీంతో మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది.

జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో రోడ్డును అధికారులు మూసివేశారు. జియాగూడ పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పురానాపూల్ నుంచి హైకోర్టుకు వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి దారి మళ్లించారు. కాగా, మూసారాంబాగ్ బ్రిడ్జ్‌పై కూడా.. మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిని క్లోజ్ చేశారు. వరద ధాటికి బ్రిడ్జ్ పిల్లర్లు పూర్తిగా డ్యామేజ్ అయినట్లు అధికారులు తెలుపుతున్నారు. అంబర్పేట్, దిల్‌షుక్‌నగర్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..

0Shares

Related posts

తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం

News Telangana

చిల్లం చర్ల లక్ష్మణరావు కుమారులను సన్మానించిన మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి

News Telangana

నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్-2023 ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

News Telangana

Leave a Comment