October 16, 2025
News Telangana
Image default
Telangana

మేకల రాములు యాదవ్ కు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఈస్ట్ బోడుప్పల్ యాదవ సంఘం.

మేడిపల్లి అక్టోబర్ 04( న్యూస్ తెలంగాణ)
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ ని ఆయన నివాసంలో ఈస్ట్ బోడుప్పల్ యాదవ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపి,శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రాములు యాదవ్ మాట్లాడుతూ
యాదవ హక్కుల పోరాట సమితి లక్ష్యాలు,పోరాటాలు
యాదవ హక్కుల పోరాట సమితి అనేది యాదవ (గొల్ల, కురుమ) కమ్యూనిటీ యొక్క సామాజిక,ఆర్థిక,రాజకీయ హక్కుల కోసం కృషి చేస్తున్న ఒక జాతీయ స్థాయి సంస్థ. అని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ సమితి క్రియాశీలకంగా ఉందిని యాదవుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఈ సమితి యొక్క ప్రధాన లక్ష్యాలు,డిమాండ్లు
యాదవ కార్పొరేషన్ ఏర్పాటుకు యాదవ కమ్యూనిటీ ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి ఒక ప్రత్యేక యాదవ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్‌కు ప్రతి బడ్జెట్‌లో ₹ 5000 కోట్ల వరకు నిధులు కేటాయించాలని కోరారు. రాజకీయ ప్రాధాన్యత రాష్ట్రంలో యాదవ జనాభా దామాషా ప్రకారం,వివిధ రాజకీయ పార్టీలు చట్టసభల్లో (అసెంబ్లీ,మండలి) యాదవులకు తగినన్ని సీట్లు కేటాయించాలని,అదే విధంగా నామినేటెడ్ పదవులు,మంత్రి పదవులు ఇవ్వాలని తెలిపారు.ఈస్ట్ బోడుప్పల్ యాదవ సంఘం అధ్యక్షుడు కొండ ఐలయ్య మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ నాయకత్వంలో ఈ సమితి క్రియాశీలకంగా పనిచేస్తూ, “యాదవులే కాబోయే పాలకులు” అనే నినాదంతో కమ్యూనిటీలో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
యాదవ కమ్యూనిటీకి సామాజిక న్యాయం,విద్య, ఉద్యోగాలలో మెరుగైన అవకాశాలు,రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ సమితి పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో బోడుప్పల్ శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షుడు ఐలయ్య యాదవ్,మాజీ అధ్యక్షుడు నర్సింగ్ యాదవ్,
ఉపాధ్యక్షులు వీరేష్ యాదవ్,రిపోర్టర్ వెంకన్న యాదవ్,మురళీమోహన్ యాదవ్,రాజు యాదవ్, సత్తయ్య యాదవ్,అమూల్య మల్లికార్జున్ యాదవ్,కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

బాన్సువాడలో గులాబీ జెండా ఎగరడం ఖాయం

News Telangana

తెలంగాణ ఫలితాలపై ప్రధాని ట్వీట్

News Telangana

మామూళ్ళ మత్తులో వాడేపల్లి ఆర్టిఏ చెక్ పోస్ట్ అధికారులు ఆగని వసూళ్ల పర్వం

News Telangana

Leave a Comment