October 16, 2025
News Telangana
Image default
Telangana

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి … మాజీ మంత్రి జీవన్ రెడ్డి

రాయికల్ అక్టోబర్ 4 , న్యూస్ తెలంగాణ :- స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.రాయికల్ పట్టణంలో ముఖ్య కార్యకర్తలతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు.రాయికల్ మండలంలోని 14 ఎంపిటిసి స్థానాల్లో అత్యధిక మెజార్టీ సాధించి ఎంపిపి పీఠం కైవసంతో పాటు,జడ్పిటిసి సైతం కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు.నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేస్తుందన్నారు.కార్యకర్తలు అభ్యర్థుల గెలుపుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,మాజీ సర్పంచులు తంగెళ్ల రమేష్,అత్తినేని గంగారెడ్డి,నాయకులు కొయ్యేడి మహిపాల్,బాపురపు నర్సయ్య,చింతలపల్లి గంగారెడ్డి,తలారి రాజేష్,కోడిపెళ్లి ఆంజనేయులు,బొడ్గం అంజిరెడ్డి,ఏలేటి జలంధర్ రెడ్డి, జగదీశ్వర్,సంతోష్,రాజేందర్ సాగర్,రామ్ రెడ్డి,తిరుపతి,రమేష్,సాగర్ తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

తెలంగాణలో తొలి కాంగ్రెస్ విజయం

News Telangana

శ్రీ మాత్రే అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్

News Telangana

న్యూస్ తెలంగాణ దినపత్రిక 2024 క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎస్సై శ్రీనివాస్ యాదవ్

News Telangana

Leave a Comment