October 16, 2025
News Telangana
Image default
Telangana

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కేసముద్రం,అక్టోబర్ 6, న్యూస్ తెలంగాణ: కేసముద్రం మండలం పీక్ల తండా కు చెందిన గూగులోత్ భాస్కర్( 40) కు ఇద్దరు కుమారులు అందులో ఒకరు ఎన్ఐటి లో బీటెక్ చదువుతున్నాడు, ఒకరు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అతనికి పీక్ల తండ శివారులో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.గత కొన్ని రోజులుగా కుటుంబ అవసరాలకు,పిల్లల చదువులకు డబ్బులు సరిపోక గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతూ,అక్టోబర్ 5,.2025 రాత్రి 09.30 గంటలకు అందరూ భోజనం చేసి పడుకొనగా తెల్లవారి జామున 05.00 గంటలకు భాస్కర్ భార్య లేచి చూడగా వాళ్ళ ఇంటి ముందు ఉన్న కొట్టం లో ఆమె చీరతో ఉరి వేసుకుని ఉన్నాడు అని భాస్కర్ భార్య గూగులోత్ సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి కిరణ్తెలిపారు.

0Shares

Related posts

మీడియా పాలసీని ప్రకటించాలి -పురుషోత్తం నారగౌని

News Telangana

ఆబిద్ అలీ ఖాన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉర్దూ భాష పరీక్ష పోటీలు

News Telangana

రెండు నెలల పాలనలో.. అభివృద్ధి శూన్యం

News Telangana

Leave a Comment