October 15, 2025
News Telangana
Image default
Telangana

పోషణ్ అభియాన్ పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్

  • గర్భిణి బాలింతలు పిల్లలు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించిన సిడిపిఓ శిరీష

కేసముద్రం / న్యూస్ తెలంగాణ :- కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని రైతు వేదిక నందు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించిన మేరకు పోషణ మాసం కార్యక్రమం ఉమ్మడి కేసముద్రం మండలంలోని నాలుగు క్లస్టర్ల ను కలిపి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ పాల్గొని మాట్లాడుతూ… గర్భిణీ స్త్రీలు, బాలింతలు,పిల్లలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. గర్భిణీ స్త్రీ పేరు నమోదు చేసిన నాటినుండి పోషణ గురించి వివరిస్తూ ఏ సమయానికి ఏ టీకాలు తీసుకోవాలో గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సమస్య రాకుండా గర్భిణీ స్త్రీలు నార్మల్ డెలివరీ అయ్యేటట్లుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని. పిల్లలు జన్మించి తర్వాత వారికి పోలియో,ఇతర టీకాలు సరియైన సమయానికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలియో రహిత ఆరోగ్య తెలంగాణ ఏర్పాటు అయ్యే దిశగా పనిచేయాలని,18 సంవత్సరాలు నిండకుండా బాల్యవివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారంగా చిన్న పిల్లలను పనిలో ఉండకుండా బడిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు విక్రయించకుండా,అబార్షన్లు చేసుకోకుండా చూడాలని, ఆడపిల్లలను సంరక్షించే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా సిడిపిఓ శిరీష మాట్లాడుతూ… ప్రభుత్వం ఇస్తున్నటువంటి గర్భిణీ స్త్రీలకు,పిల్లలకు సంబంధించిన గుడ్లు, పాలు,పప్పు దినుసులు, బాలామృతం వారికి అందే విధంగా చూడాలని,1000 రోజుల ప్రాముఖ్యత గురించి, పిల్లలను వంగవీటి వాడి కేంద్రాలకు పంపించేలా చూడాలని అదేవిధంగా పరిశుభ్రతను నేర్పాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రావు,కేసముద్రం పి హెచ్ సి డాక్టర్,ఏవో వెంకన్న,జిల్లా ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు,ఆర్టిఏ మెంబర్ రావుల మురళి,బండారు వెంకన్న, దస్రు నాయక్,బండారు దయాకర్,అంగన్వాడి సూపర్వైజర్లు దుర్గ, ప్రేమ జ్యోతి,విజయ, పద్మావతి అంగన్వాడీ టీచర్లు,తల్లులు,పిల్లలు పాల్గొన్నారు.న్నారు

0Shares

Related posts

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు

News Telangana

మాజీ సీఎం కెసిఆర్ ఆసుపత్రి ఖర్చులు మేమే భరిస్తాం: మంత్రి దామోదర నరసింహ

News Telangana

మేడి శీను కుటుంబాన్ని పరామర్శించిన జాటోత్ హరీష్ నాయక్

News Telangana

Leave a Comment