October 15, 2025
News Telangana
Image default
Telangana

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్ర*మాదం.. నలుగురు మృ*తి

కామారెడ్డి ప్రతినిధి.( న్యూస్ తెలంగాణ ). అక్టోబర్ 15
కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో బుధవారం ఘోర
రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి నుంచి రామాయంపేట వైపు స్కూటీపై వెళ్తున్న నలుగురిని రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. దీంతో స్కూటీలో ఇద్దరు బాలురు చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని బయటకు తీశారు. ఇద్దరిలో ఒకరు మృతి చెందగా.. మరో బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొదుతూ బాలుడు మరణించాడు. వీరు ఖమ్మంలో నివాసముంటుండగా.. జంగంపల్లి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి బిక్కనూరు పోలీసులు చేరుకుని మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

0Shares

Related posts

భారతీయ విద్యార్థులు రాకుండా ట్రంప్ మరో రూల్ !

News Telangana

భూ కబ్జాల”పల్లాకు” పరాభావం ఖాయం

News Telangana

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ ( జేఏసీ ) నూతన కార్యవర్గం

News Telangana

Leave a Comment