October 16, 2025
News Telangana
Image default
Life StyleTelangana

సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి లభించిన చట్టబద్ధత

హైదరాబాద్ డిసెంబర్ 19 ( News Telangana ) : ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.

ఇటీవలే ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే తాజా గా,సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి చట్టబద్ధత లభించింది.

కేంద్ర విశ్వ విద్యాలయాల చట్టం-2009లో తెలంగాణ లోని ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యా లయం పేరును చేరుస్తూ విద్యాశాఖ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును ఈ నెల 7వ తేదీన లోక్‌సభ 13వ తేదీ న రాజ్యసభ ఆమోదిం చాయి.

దాంతో ఆ బిల్లుకు నిన్న‌టి రోజున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు దీంతో ఈ బిల్లు అది చట్టరూపం దాల్చింది ఈ మేరకు న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014 లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వ విద్యాలయాన్ని ఏర్పా టు చేస్తున్న విషయం తెలి సిందే. ఏడేళ్లలో రెండు దశల్లో రూ.889.07 కోట్లు ఖర్చు చేయనుంది.

ఈ మొత్తాన్ని కేంద్ర విద్యా శాఖ బడ్జెట్‌ రూపంలో అం దించనున్నట్లుతెలుస్తుంది.

0Shares

Related posts

పార్లమెంటుపై దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి అరెస్ట్?

News Telangana

కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

News Telangana

మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అష్టమి జన్మదిన వేడుకలు

News Telangana

Leave a Comment